Home » వీధి వ్యాపార సముదయం ప్రారంభం

వీధి వ్యాపార సముదయం ప్రారంభం

by Admin
370Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పెట్ డివిజన్ పరిధిలో హుడా కాలనీ లోని నూతనంగా నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయం ను డీసీ శ్రీ సుధాంష్, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి అరెకపూడి గాంధీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన చిన్న చితక విధి వ్యాపారాలు చేస్తున్న  వారికి ఒక చక్కటి వాతావరణం తో కూడిన వ్యాపారా సముదాయం ను రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేయడం, ఒకే చోట అన్ని రకాల వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా అన్ని హంగులతో,సకల సౌకర్యాలతో  ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అని అన్నారు. పారిశుధ్య నిర్వహణ ఏర్పాటు చేయడం తో పాటు ప్రస్తుతం 120 మంది లబ్ధిదారులకు అవకాశం ఉంటుందని అవసరం అయితే మరింత మందికి విస్తరించే అవకాశం ఉంది అని ఆయన  పేర్కొన్నారు. ఈ చక్కటి సదావకాశాన్ని వీధి వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ వత్సల దేవి జిహెచ్ఎంసి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు మిరియాల రాఘవ రావు, వాలా హరీష్, కరుణాకర్ గౌడ్, మిద్దెల మల్లారెడ్డి, దొంతి శేఖర్ పద్మారావు, రవీందర్ రెడ్డి, కాశినాథ్ యాదవ్, రజినీకాంత్, తిరుపతి, మోసినుద్దిన్, సుధాకర్, పద్మ రావు, హనీఫ్, నరేందర్, రాజు యాదవ్, శంకర్, ఉమేష్, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment