
తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండల కేంద్రంలో ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెస్పి చేవెళ్ల నియోజకవర్గ ఇంఛార్జి క్యాసారం శంకర్ రావు మాదిగ, ఎమ్మార్పీఎస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం ఆగస్టు మూడో వారంలో హైదరాబాద్ లో జరగబోయే మాదిగల మరోవిశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి మాదిగ, మాదిగ ఉపకులాలు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి శివ శంకర్ మాదిగ, జిల్లా కో కన్వీనర్ భానుప్రసాద్, శ్రీనివాస్, ప్రవీణ్, మహేందర్, సీనియర్ నాయకులు లక్ష్మయ్య, నర్సింహ, రాంచందర్, పెంటయ్య, తిరుపతి, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.