Home » వాల్మీకి ఫౌండేషన్ బాలికల విద్యకు చేయూత

వాల్మీకి ఫౌండేషన్ బాలికల విద్యకు చేయూత

by Admin
12.4kViews
96 Shares

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి :  బాలికల విద్యకు చేయూత గా నిలిచిన వాల్మీకి ఫౌండేషన్. లేడీ బర్డ్ సైకిళ్లు పంపిణీ శంకర్పల్లి మండలంలోని జన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న ఇంద్రారెడ్డి నగర్, మిర్జాగూడ ప్రాంతాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలకు మరియు ప్రొద్దుటూరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఒక అమ్మాయికి స్వాతంత్ర్య దినోత్సవన్ని పురస్కరించుకొని వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు సైకిళ్ళు మండల విద్యాధికారి సమక్షంలో ఫౌండేషన్ సభ్యులు చిన్న,నాయుడు మరియు సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ అందించడం జరిగింది.ఈ సందర్భంగా మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ మరియు ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ బాలిక విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాల్మీకి ఫౌండేషన్ వివిధ ప్రాంతాల నుండి కాలినడకన వచ్చి చదువుకునే పేద విద్యార్థినులకు లేడీ బర్డ్ సైకిళ్లు ఉపయోగకరంగా ఉంటాయని భావించి శంకర్పల్లి మండలంలో గత జూన్ నుండి ఇప్పటివరకు 30 సైకిళ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేసి,బాలికలకు వాల్మీకి ఫౌండేషన్ ఎప్పుడు తోడుగా ఉంటుందని,బాలికలు ఎందులో కూడా తక్కువ కాకుండా అన్ని రంగాల్లో రానించాలని,చదువుతోనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామనీ, అమ్మాయిలు అబ్బాయిలతో పాటు సమానంగా విద్య,ఉద్యోగ రంగాల్లో రాణించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపినపుడే నిజమైనటువంటి స్వాతంత్ర్యం సిద్ధించినట్లు అవుతుందని తెలియజేసి,బాలికలు ఏమాత్రం ఏమరపాటుకు, భయభ్రాంతులకు గురికాకుండా ఏకాగ్రతతో చక్కగా చదువుకోవాలని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు నర్సింగ్ రావు, ఉపాధ్యాయులు, శ్రీనివాస్, సత్యనారాయణ, వెంకటేష్, దేవేందర్ రెడ్డి, జగదీష్, దీపికరాణి, లలిత, పద్మ, జ్యోతిర్మయి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment