Home » హైదరాబాద్ లో కేరళ ఫుడ్ ఫెస్టివల్…

హైదరాబాద్ లో కేరళ ఫుడ్ ఫెస్టివల్…

by Admin
770Views

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: అమీర్ పేటలోని హోటల్ ఆదిత్య పార్క్ లో ఉన్న ద ప్రమోనేడ్ రెస్టారెంట్ వారు “ఓనం సద్య” కేరళ ఫుడ్ ఫెస్టివల్ ను 21 ఆగష్టు నుండి 23 ఆగష్టు వరకూ నిర్వహిస్తున్నారు. ఇందులో సాంప్రదయ కేరళకు సంబంధించిన పలు సాంప్రదాయ వంటకాలు రుచులను ఈ సందర్భంగా ఆస్వాదించవచ్చు.       

హోటల్ కు చెందిన మాస్టర్ ఛెఫ్ శ్రీనివాస్ ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసిన వంటకాలతో కూడిన ఈ మెనూలో కేరళ ప్రాంతానికి చెందిన రుచలను స్వయంగా అనుభవించవచ్చు. ఎంపిక చేసిన మళయాళి రుచుల మేళవింపుతో రూపొందించిన వంటకాలతో 3 రోజుల ఉంటుంది. అనుభవం గడించిన ఛెప్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం కొందరికే పరిమితమైన ఈ వంటకాలను మీ అందరికీ పరిచయం చేయబోతోంది. ఈ 3 రోజుల ప్రయాణంలో ఎన్నో రుచికరమైన వంటకాలు ముఖ్యంగా వాజై అప్పర్, సర్కార వరాట్, పులి ఇంజి, కడు మంగ, నిరంగ అచార్, మధుర కర్రి, వెల్లారి పచ్చడి, పజమ్ నురుక్కు, కేరళ పాపడ్, బనానా, పయారు థోరన్, అవియల్, కాలన్, ఓలన్, కూటు కర్రి, కైథా చక్కా పుసిశ్శెరి, నీ పరుప్పు, సాంబార్, రసమ, సంబరమ్, అడ్ ప్రధమన్, చెరుపాయర్ ప్రధమన్ వంటి వెజిటేరియన్ వంటకాలు మెనూలో భాగంగా ఉంటాయి. ఇలా తయాలు చేసిన కేరళ భోజనాన్ని సాంప్రదాయ పద్దతిలో అరటిఆకు పై అందించడం జరుగుతుంది.  ఈ సందర్భంగా హోటల్ ఆదిత్య పార్క్ కు చెందిన F&B మేనేజర్ రాజా మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రుచులను గెస్టులకు అందించే లక్ష్యంతో ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి వ్యక్తికి కేవలం 499 రూపాయల (ట్యాక్స్ లు అదనం) లకే ఈ భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు. భోజన వేళలలో అందించే రుచులకు అనుగుణంగా కేరళ ను గుర్తుకు తెచ్చేలా రెస్టారెంట్ ను అలంకరించిన తీర్చిదిద్దడంతో ఒక మంచి అనుభూతి కలుగుతుందని ఆయన వివరించారు. గాడ్స్ ఓన్ కంట్రీగా ప్రఖ్యాతి గాంచిన కేరళ కు చెందిన ప్రత్యేకమైన రుచులను ఆస్వాదించాలనుకొనే భోజన ప్రియులను రెస్టారెంట్ సాదరంగా ఈ ఫుట్ ఫెస్టివల్ కు ఆహ్వానిస్తోంది. రిజర్వేషన్లు, ఇతర సమాచారం కోసం సంప్రదించండి హోటల్ ఆదిత్య పార్క్, ఆదిత్య ట్రేడ్ సెంటర్, అమీర్ పేట, హైదరాబాదు – 7032900753 – 04066788888 అని తెలిపారు.

You may also like

Leave a Comment