Home » సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తుంది : ఎమ్మెల్యే గాంధీ

సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తుంది : ఎమ్మెల్యే గాంధీ

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం   హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీకి చెందిన కృష్ణం రాజుకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి ద్వారా మంజూరైన రూ. 2 లక్షల ఆర్థిక సహాయానికి సంబందించిన మంజూరి పత్రాలను బుధవారం బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బ్రిక్ శ్రీనివాస్ , పద్మారావు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment