
780Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా ప్రియాంక ఆలా నియమితులయ్యారు. జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంకను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రవికిరణ్ ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ప్రియాంక ఆలా బుధవారం శేరిలింగంపల్లి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.