
12.1kViews
494
Shares
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో శాంకరి కూచిపూడి డాన్స్, మ్యూజిక్ అకాడమీ శ్రీ పద లాస్యం ” రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలలో వినాయక స్తుతి, భైరవి వర్ణం, జావళి, ప్రహళ్లాద శబ్దం, త్రిశక్తి స్తుతి, నవరాగమాలిక వర్ణం, తారంగం, తిల్లాన , మహిషాసుర మర్ధిని స్తోత్రం అంశాలను ప్రదర్శించి మెప్పించారు. ఈరోజు ముఖ్య అతిధులుగా నాట్య గురువులు ప్రొఫెసర్ భాగవతుల సేతురాం, డాక్టర్ సాగి కమలాకర శర్మ, లలిత సుధాకర్ , డాక్టర్ రమాదేవి, డాక్టర్ అనంత లక్ష్మి ముఖ అతిధుల విచ్చేసి కళాకారులను అభినందించి ఆశీర్వదించారు.