
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో అంతర్జాతీయ హస్త కళల మేళ ఎంతగానో ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్ర ప్రజలు వారి రాష్ట్ర చేనేత చీరలు శిల్పారామంలో అధికంగా కొనుగోలు చేస్తున్నారు. జహ్మ్దని చీరలు, టుస్సార్ పట్టు,కాటన్,బెంగాలీ చీరలు, జ్యూట్ బాగ్స్,లక్క బ్యాంగిల్స్,మధుబని పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్,తంజావూర్ పెయింటింగ్, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్,పెయింటింగ్ డ్రెస్ మెటీరియల్స్, పరుపులు,రజాయిలు,పిల్లో చొవెర్స్,డోర్ కర్టైన్స్ ,గాజులు,కాటన్ షర్ట్స్ ప్రత్యేకంగా సందర్శకులకు అందుబాటులో ఉంచారు.అదేవిదంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హంపీ థియేటర్ ఉమాశంకర్ బృందం ప్రదర్శరించిన మొహినియాట్టం నృత్య ప్రదర్శించిన వేణువు నాదం శ్రావ్యంగా ఆలపించారు.అనంతరం అనిత పీటర్శిష్య బృందం గణేశా శ్లోకం ఏకదంతాయ, స్వాతి తిరుణాల్ జతిస్వరం,నవరసాంజలి,తిల్లాన అంశాలను సుమ,కేదార్నాథ్,దియా,పూజ రాధికా, ప్రభ రాంగోపాల్ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వీరికి నట్టువాంగం అనిత పీటర్, మ్రిదంగం గాత్రం శ్రీ త్రిసూర్ రామచంద్రన్,వేణువు శ్రీ దత్తాత్రేయులు,వయోలిన్ సాయి కోలంక సహకరించారు.