
*30 ఏళ్ల తర్వాత నాటి ఉపాధ్యాయులతో కలిసి కలుసుకున్న పూర్వ విద్యార్థులు…..
*ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి నాటి తీపి గుర్తులను పంచుకున్న నాటి విద్యార్థులు
*బ్యాచ్ లోని ఓ సహచరుని ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చి గొప్ప మానవతా దృక్పథం చాటిన పూర్వ విద్యార్థులు.
తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : పదవ తరగతి పూర్తయిన 30 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్హులంతా ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. శంకర్ పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మంగళవారం శంకర్ పల్లిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఉపాధ్యాయులను కలుసుకొని నాటి తీపి గుర్తులను పంచుకున్నారు.ఈ సందర్బంగా 1991-92 సంవత్సరంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన నర్సింహా రెడ్డి,ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి,మాణిక్య రెడ్డి, రామాంజనేయులు, మురళీధర్ రెడ్డి,నర్సింహా రావు,సత్యనారాయణ లను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ..30 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒక చోట చేరడం అభినందనీయమని,అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరూ ముందు ముందు పలు సమాజ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్బంగా ఉపాధ్యాయులు సూచించారు.పూర్వ విద్యార్హులంతా తమ బ్యాచ్ లోని ఓ సహచరుని ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చి గొప్ప మానవత దృక్పథం చాటుకున్నారు.