
1.2kViews
తెలంగాణ మిర్రర్, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా, పూడూర్ మండలంలోని చిటంపల్లి గ్రామంలో దారుణం. పదోతరగతి చదువుతున్న విద్యార్థిని పై ఆత్యాచారం, హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసుల వివరాల ప్రకారం..పూడూర్ మండలం పరిధిలోని చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగడి చిటంపల్లి గ్రామంలో పదో తరగతి చదువుతున్న బాలిక తెల్లవారుజామున కాల కృత్యాల నిమిత్తం ఆరుబయటకు వెళ్ళినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతంలో బాలిక పై అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.