Home » లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే గాంధీ

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే గాంధీ

by Admin
580Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను బాధిత కుటుంబాలకి కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు తెలిపారు.

*CMRF- చెక్కుల వివరాలు..

1.మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కి చెందిన, ముంతాజ్ బేగం కి 40,000 /-

2.మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ కి చెందిన నవీన్ కి 30,000 /-

3.గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మొహర్ కాలనీ కి చెందిన సింహాద్రికి – 27,000/-

..అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, తెరాస నాయకులు మోహన్ ముదిరాజు, ఉట్ల చంద్రారెడ్డి , బ్రిక్ శ్రీను, కాశినాథ్ యాదవ్, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, ఇబ్రహీం, రజినీకాంత్, చంద్రమోహన్ సాగర్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment