Home » రాఖీ పర్వదినం చాలా పవిత్రమైనది : అరెకపూడి గాంధీ

రాఖీ పర్వదినం చాలా పవిత్రమైనది : అరెకపూడి గాంధీ

by Admin
970Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: రాఖీ పర్వదినం సందర్భంగా చందానగర్ డివిజన్  కార్పొరేటర్  మంజుల రఘునాథ్ రెడ్డి  ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టడం జరిగినది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆత్మీయ అన్న చెల్లెలకు, అక్క తమ్ముళ్లకు ఆత్మీయ సోదరిమణులందరికి రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేశారు. అదేవిధంగా పండుగను చక్కటి వాతావరణం లో కుటుంబ సభ్యుల మధ్య ఆనందాయకంగా, సంతోషకరంగా జరుపుకోవాలని కోరారు. రాఖీ పర్వదినం చాలా పవిత్రమైనది అని అన్న చెల్లెల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్ష బంధన్ అని ప్రభుత్వ విప్ గాంధీ  పేర్కొన్నారు. అదేవిధంగా పవిత్ర ప్రేమను చాటిచెప్పే ‘రాఖీ పౌర్ణమి. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ రక్షాబంధన్. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.అన్నంటే..అమ్మలో మొదటి సగం ..నాన్న లో రెండో సగం ..అన్నచెల్లెల అనురాగానికి గుర్తే రక్షా బంధనం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రాఖీ పండుగను విజయవంతంగా ,ఆనందముగా జరుపుకోవాలని ప్రభుత్వవిప్ గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment