Home » యస్ అర్ హెచ్ ఫ్యామిలీ సెలూన్ నూతన శాఖ ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

యస్ అర్ హెచ్ ఫ్యామిలీ సెలూన్ నూతన శాఖ ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

by Admin
530Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని  కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యస్ అర్ హెచ్ ఫ్యామిలీ సెలూన్ 4వ బ్రాంచ్ ను  ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్  కార్పొరేటర్  హమీద్ పటేల్  ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా యస్ అర్ హెచ్ ఫ్యామిలీ సెలూన్ సంస్థ చైర్మన్ మాదాసు రమేష్, ఎండి ఉపేందర్ లకు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ శుభాకాంక్షలు తెలియజేశారు. గత 5 సంవత్సరాలుగా ఉత్తమ సేవలు అందిస్తూ, ప్రజల ఆధారాభిమానాలతో శాఖలను పెంచుకుంటూ వెళుతున్నారని, యస్ అర్ హెచ్ ఫ్యామిలీ సెలూన్ అత్యాధునిక పరిజ్ఞానంతో అన్ని రకాల సెలూన్ సేవలు అందించటం మంచి విషయమని పేర్కొన్నారు. ప్రజలకు వారి అభిరుచి మేరకు మంచి సేవలను అందిస్తూ, యస్ అర్ హెచ్ సంస్థ అభివృద్ధి చెందాలని విచ్చేసిన పెద్దలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ తో పాటు కార్పొరేటర్ హమీద్ పటేల్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ యాదవ్, రాజా రాజేశ్వరి కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, యూత్ నాయకులు దీపక్ అజయ్ సింగ్,వెంకటేష్, శ్రీనివాస్, రామకృష్ణ, జానీ, వంశీ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment