
12.6kViews
143
Shares
తెలంగాణ మిర్రర్,శంకర్ పల్లి : మోకిలా గ్రామాన్ని మున్సిపాలిటీలో గాని కార్పొరేషన్ లోని కలపకూడదని శంకరపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు నాయక్ అన్నారు. ఆదివారం ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొంతకాలంగా శంకర్పల్లి మండల పరిధిలోని మోకిలా, శేరి గూడెం, మోకిల తాండ గ్రామపంచాయతీలను శంకర్పల్లి మున్సిపాలిటీలో కలిపి కార్పొరేషన్ చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. మోకిలా గ్రామాన్ని గ్రామపంచాయతీ గానే ఉంచాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలుగా ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. జనాభా ప్రాతిపదికన మోకిలా గ్రామంలో ఇప్పటికే పోలీస్ స్టేషన్ వచ్చిందని అన్నారు.మోకిలా క్లస్టర్ లోని 13 గ్రామాలను కలిపి మోకిలాను మండల కేంద్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.