
9.4kViews
125
Shares
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నూతనంగా చేపడుతున్న సి సి రోడ్ పనులను కార్పొరేటర్ జిహెచ్ఎంసి సంబంధిత అధికారులతో పాటు కాలనీ వాసులతో కలిసి పరిశీలంచారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సిసి రోడ్ పనులలో నాణ్యతాప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ శ్రీకల, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షులు బసవరాజ్ లింగయత్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, మహేష్ రాపన్, సీనియర్ నాయకులు సుధాకర్, ఉమాకాంత్, మహిళా నాయకురాలు రోజా, లక్ష్మి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.