
1.2kViews
తెలంగాణ మిర్రర్,పటాన్చెరు : మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో ద్వారకామాయి హోమ్స్ లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం వేడుకలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి కాలనీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులతో పాటు అన్నిరంగాలలో రాణంచటం హర్షించదగ్గ విషయమన్నారు.మహిళలు ఆర్థికంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ నిలదిక్కుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ మహిళలు,చిన్నారులు పాల్గొన్నారు.