Home » మలబార్ గోల్డ్ & డైమండ్స్ చందానగర్ లో “మైన్ డైమండ్స్” షో ప్రారంభం

మలబార్ గోల్డ్ & డైమండ్స్ చందానగర్ లో “మైన్ డైమండ్స్” షో ప్రారంభం

by Admin
13.1kViews
353 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : ప్రపంచంలో అతి పెద్ద జ్యూవెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్ తమ చందా నగర్ షోరూంలో “మైన్ డైమండ్స్” షోని ప్రారంభించింది . ఈ సంస్ధ చెందిన చందా నగర్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ డైమండ్ షోని చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్ష్ రెడ్డి ముఖ్య అతిధులు గా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ డైమండ్ షోలో రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని మలబార్ వారు అందిస్తున్నారు అని అన్నారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిబద్ధతలో భాగంగా, తమ వినియోగదారులకు 10 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, నూరు శాతం బి.ఐ.ఎస్ హాల్ మార్కుతో ధృవీకరించబడిన స్వచ్ఛమైన బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28-పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన ఐజిఐ మరియు జిఐఎ ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారెంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ, బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుంది. షోరూం హెడ్ దీపక్ కుమార్ మాట్లాడుతూ మీకు నచ్చిన నగలను సొంతం చేసుకొనే విధంగా కేవలం మలబార్ గోల్డ్ & డైమండ్స్ చందనగర్ షోరూంలో అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 26 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుంది తెలిపారు.

You may also like

Leave a Comment