Home » భాగ్యనగర్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు

భాగ్యనగర్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు

by Admin
12.7kViews
109 Shares

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : త్వరలో భాగ్యనగర్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరుగనున్నాయి. ఎప్పుడెప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కాలని ఎదురు చూస్తున్న హైదరాబాదిలకు తెరపడింది మంగళవారం మంత్రకేదార్ల మూడ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్, చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, సి  ఎస్ శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు.
త్వరలో మరో మూడు డబుల డెక్కర్ బస్సులు కొనుగోలు చేయనున్నారు. ఇంకా 20 బస్సులను తీసుకురావాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) యోచిస్తోంది. ఒక్కొక్క బస్సు రూ.2.16 కోట్లు, దానితో పాటు 7 సంవత్సరాలు AMC వస్తుంది.
ఈ బస్సులలో డ్రైవర్లో పాడు 65 మంది ప్రయాణికులతో సిట్టింగ్ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సులకు ఛార్జింగ్ సమయం 2 నుండి 2.5 గంటలలో పూర్తిగా ఛార్జ్ చేయబడతాయి. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల మార్గంలో నడపనున్నారు. ఈ నెల 11న ఫార్ములా ఇ-ప్రిక్స్ తో ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్ , నెక్లెస్ రోడ్, ఫ్యారడైజ్, నిజాం కాలేజీ స్టేజీలను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరగనున్నాయి. ఈ బస్సులు హెరిటేజ్ సర్క్యూట్ లో ఉపయోగించాలని యోచిస్తున్నారు.

You may also like

Leave a Comment