Home » బూస్టర్ డోసు వేయించుకున్న శాసన సభ్యులు జిఎమ్ఆర్

బూస్టర్ డోసు వేయించుకున్న శాసన సభ్యులు జిఎమ్ఆర్

by Admin
1.3kViews

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం తన నివాసంలో కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బూస్టర్ డోస్ వేయించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు తెలిపారు.ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన విధంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే జిఎమ్ఆర్ కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment