
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో పాల్గొని చరిత్ర సృష్టించిన శ్రీ చైతన్య విద్యాసంస్థ. భారత విద్యారంగంలో శ్రీచైతన్య అంటేనే ఒక సంచలనం. ఏది చేసినా విభిన్నంగా, వినూత్నంగా చేయటం అనుకున్న లక్ష్యాన్ని అద్భుతంగా సాధించి అద్భుతాలను సృష్టించటం శ్రీచైతన్యకు అలవాటైన విద్య. ఇప్పటికే రెండు వరల్డ్ రికార్డులను సృష్టించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. 100 రోజుల శిక్షణతో 10 రాష్ట్రాలలోని 73 బ్రాంచీల నుండి 400 జూమ్ లింక్స్ ద్వారా 2000 కి పైగా ప్రైమరీ, ప్రీ-ప్రైమరీ విద్యార్థులు పాల్గొని 1 నుండి 100 వరకు మ్యాథ్స్ టేబుల్స్ 100 నిమిషాలలోపు తిరిగి అప్పజెప్పి అందిరిని ఆశ్చర్యపరిచి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించారు. దీనిని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు పర్యవేక్షించి పరీక్షించి రికార్డును నమోదు చేశారు. అనంతరం సర్టిఫికెట్ ను ప్రదానం చేసి ప్రశంసించారు. దీంతో శ్రీచైతన్య హ్యాట్రిక్ ప్రపంచ రికార్డును సృష్టించిన స్కూల్ గా చరిత్రలో నిలిచింది.
ఈ సందర్భంగా శ్రీచైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ స్టూడెంట్స్ టీచర్స్ ఒక్కటై ఎంతో ఇష్టంతో కృషిచేయటం వల్లే ఇంతటి గొప్ప విజయం, వరల్డ్ రికార్డ్ సాధ్యమైందని తెలిపారు. శ్రీచైతన్య స్కూల్స్ అంటేనే గ్రేట్ ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనీ, ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ స్థాయిల్లోనే చిన్నారుల్లో దాగివున్న నైపుణ్యాలను మేగ్జిమమ్ వెలికితీయడం, సక్రమమైన మార్గంలో వారి ట్రెయిన్స్ని ట్రైన్ చేయటం, ఎలాంటి ఒత్తిడి లేకుండా వారిపై వారికి నమ్మకం పెంచుతూ చిన్న వయస్సు నుండే విజేతలుగా మార్చటం శ్రీచైతన్య స్కూల్స్ లక్ష్యమని తెలియజేశారు. శ్రీచైతన్య సైంటిఫిక్ మెథడ్స్, రీసెర్చ్ టేస్ట్ కరిక్యులమ్, వెల్ ప్లాన్ టీచింగ్ సిస్టమ్ మా విద్యార్ధుల్ని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో టాపర్స్ గా మారుస్తోందని, అందుకే తమకే ఇంతటి వరల్డ్ రికార్డులు సాధ్యమవుతున్నా యని వివరించారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు పాల్గొనే నాసా NSS స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లోనూ వరుసగా 9 సంవత్సరం శ్రీచైతన్య స్కూల్ ప్రపంచ ఛాంపియన్ గా నిలవటం శ్రీచైతన్య స్కూల్స్ ఆధిపత్యానికి నిదర్శనమని తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఈవెంట్లో పాల్గొన్న చిన్నారులను అభినందించారు.
ఈ కార్యక్రమములో నల్లగండ్ల శాఖ మేవరిక్స్ విభాగానికి చెందిన విద్యార్ధులు పాల్గొని 28 మంది విజేతలుగా నిలిచారు. ఏ. జీ.యం శివరామకృష్ణ, అకాడమిక్ చీఫ్ హెడ్ పుష్పవల్లి, ప్రిన్సిపల్ వాణి, జోనల్ కోఆర్డినేటర్ అన్నపూర్ణ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డా|| బి.ఎస్. రావు వరల్డ్ రికార్డ్ సృష్టించిన చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, నిరంతరం కృషి చేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి అభినందనలు తెలిపారు.