
1.2kViews
తెలంగాణ మిర్రర్, చేవెళ్ల: ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గా నియమితులైన డాక్టర్ వకుళ భరణం కృష్ణమోహన్ రావు సభ్యులు యన్. శుభప్రద్ పటెల్ ల ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య. ఈ సందర్భంగా కాలే యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ గా డాక్టర్ కృష్ణమోహన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించబడటం ఓ చారిత్రాత్మక ఘట్టమని, బీసీలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అపురూప వరమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈలాంటి మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.