
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ సేవా సమర్పన్ అభియాన్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 20 సంవత్సరాల రాజకీయ అధికారికంగా పూర్తయిన సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గజ్జల యోగానంద , రవి కుమార్ యాదవ్ , జ్ఞానెంద్ర ప్రసాద్ ల సహకారంతో మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి వారి సారధ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మాజీ శాసనసభ్యులు మారబోయిన బిక్షపతి యాదవ్ శనివారం మమత అకాడమీ ఆఫ్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ నయన్ రాజ్, మెడికల్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ చంద్ర శేఖర్ లతో కలిసి ప్రారంభించారు.ఈ వైద్య శిభిరంలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం మందులను పంపిణి చేసారు.అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గజ్జల యోగానంద చేతుల మీదగా డాక్టర్లకు పారామెడికల్ సిబ్బందిని సన్మానించి మెమెంటో లను బహుకరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ ,కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, మనోహర్ కలివేముల ,రవి గౌడ్ ,వినయ పార్వతి ,మేరీ, వినీత సింగ్, కల్పనా,సింధు రెడ్డి, నరేంద్ర ముదిరాజ్ , వర ప్రసాద్ చంద్రమోహన్, నందు కుమార్, శ్రీనివాస్ యాదవ్, బాబు రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, శ్రీశైలం కురుమ, నాందేవ్,నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.