
620Views
తెలంగాణ మిర్రర్, మియాపూర్: నియంతృత్వ, కుటుంబ పాలన, అవినీతి విముక్తి కోసం తెలంగాణను కాపాడేందుకు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీసులు తీసుకొని ప్రారంభించిన ప్రజాసంగ్రామ పాదయాత్ర హుస్నాబాద్ లో మొదటి విడత ముగింపు సందర్భంగా బహిరంగసభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.