
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురికి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF – LOC ద్వారా మంజూరైన రూ. 6,50,000/- రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలను వెల్లడించారు.
1.మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కి చెందిన జ్యోతి కి 5,00,000/- LOC
2.గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కాజాగుడా కి చెందిన లక్ష్మీ నారాయణ కి 1,50,000/-
..అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.