Home » పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి : శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు

పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి : శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తెలంగాణ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు శేరిలింగంపల్లి జోనల్ ఎలక్ట్రికల్ ఏ.డీ.ఈ కార్యాలయం వద్ద బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నిరసన కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన నిత్యావరసర ధరలు,ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై కరెంట్ చార్జీల పెంపుభారం సరైంది కాదు అని అన్నారు.గత రెండేళ్లుగా కరోనాతో ఉపాధి లేక, ఉన్న ఉద్యోగాలు పోయి భారంగా బతుకు వెళ్లదీస్తున్న ప్రజలపై ఈ విధమైన భారం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే డెవలప్ మెంట్ చార్జీల పేరుతో అదనపుభారం వేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మూలిగేనక్కపై తాటిపండు పడట్టు విద్యుత్ చార్జీలు పెంచింది అని విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి ఇప్పుడు ఆ భారాన్ని జనంపై మోపడం దారుణమన్నారు.ఇంతకు ముందు కరెంట్ తీగను ముట్టుకుంటే షాక్ కొట్టేంది,కేసీఆర్ పాలనలో కరెంట్ బిల్లును ముట్టుకుంటే షాక్ కొడుతోంది అని అన్నారు.పెంచిన విద్యుత్ చార్జీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జిల్లా నాయకులు బుచ్చిరెడ్డి,మూల అనిల్ గౌడ్,మారం వెంకట్, డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, హరికృష్ణ, కృష్ణ, శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు కాంచన కృష్ణ,మహిపాల్ రెడ్డి, మనోహర్, రాఘవేందర్ రావు, ఎల్లేష్, కసిరెడ్డి సింధు,మహేష్ యాదవ్,రవి గౌడ్, హరిప్రియ,మహిళా నాయకురాళ్లు పద్మ, వరలక్ష్మి,నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment