
తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీ లో వంద శాతం వాక్సినేషన్ పూర్తి కావడంతో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో సోమవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసాపత్రాన్ని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ కి అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గచ్చిబౌలి డివిజన్ ప్రతి కాలనీలో వంద శాతం వాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజలు ముందుకు రావాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. డివిజన్ వ్యాప్తంగా పలుచోట్ల మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను పరిసిలించి పర్యవేక్షించారు. ప్రత్యేక శ్రద్ధాతో అందరికి వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తున్నామని తెలియజేశారు. దగ్గరలో ఉన్న వాక్సిన్ కేంద్రాల వద్దకు వెళ్లి కోవిడ్ టీకా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్, గుల్మొహర్ పార్క్ కాలనీ, ప్రెసిడెంట్ ఖాసిం, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు, జనరల్ సెక్రటరీ నిరజన్ రెడ్డి, అడ్వైసర్ జై రాజ్ సింగ్, గోపనపల్లి వడెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, వెంకట్ రెడ్డి, రాయుడు, బట్టు కుమార్, కమర్ పాష, వెంకటేశ్వర్లు, దాస్, ప్రకాష్ , జీహెచ్ఎంసీ ఎస్ ఆర్ పీ భరత్, జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్ రాఘు తదితరులు పాల్గొన్నారు.