
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :
ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్,శాసన సభ్యులు అరెకపూడి గాంధీ అన్నారు.శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్,హఫీ పెట్,మాదాపూర్ డివిజన్ లలో పలు కాలనీ లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మియాపూర్, డివిజన్ పరిధిలోని నాగార్జున ఎనక్లేవ్, ఏ ఎస్ రాజు నగర్ కాలనీలలో రూ. 01 కోటి 64 లక్షల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు,వరద నీటి కాల్వల నిర్మాణం పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అదేవిధంగా హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, జనప్రియ నగర్ కాలనీలలో రూ. 01 కోటి 29 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం పనులకు,కార్పొరేటర్ పూజిత గౌడ్ మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్,గోకుల్ ప్లాట్స్, సిద్ధివినాయక నగర్, జెఎన్ టి యు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు రూ. 04 కోట్ల 69 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి విప్ ,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి కేటీఆర్ ల సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు