
500Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: దుర్గాష్టమి సందర్భంగా తారానాగర్ లోని శ్రీ శ్రీ శ్రీ తుల్జాభవాని మాత దేవాలయంలో అమ్మవారికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ పండితులు కార్పొరేటర్ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తారానాగర్ శివమండలి యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వీరేశంగౌడ్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.