
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పిలుపుమేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలని,నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రంగారెడ్డి అర్బన్ జిల్లా, శేరిలింగంపల్లి అసెంబ్లీ,చందానగర్ డివిజన్ బీజేవైఎం ఆధ్వర్యంలో తారనగర్ మార్కెట్ రోడ్డులో “కోటి సంతకాల సేకరణ” కార్యక్రమాన్ని చేపట్టారు.అనంతరం బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్,బీజేపీ రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, రవికుమార్ యాదవ్ లు మాట్లాడుతూ లక్షా ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన మాటను తప్పిన వ్యక్తి కేసీఆర్ తెలంగాణలో లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ తేల్చింది. తెలంగాణలో జరుగుతున్నవి నిరుద్యోగుల ఆత్మహత్యలు కాదు..రాష్ట్ర ప్రభుత్వ హత్యలే. వీటికి కారణమైన సీఎం కేసీఆర్ పై కేసులు నమోదు చేయాలనీ అన్నారు.నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. కేసీఆర్ పాలనపై ఆఖరి ఉద్యమానికి సిద్ధం కావాలి, నోటిఫికేషన్లు ఇచ్చే వరకు నిరుద్యోగుల తరుపున బిజెపి, బీజేవైఎం పోరాడుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి ,బీజేపీ డివిజన్ అధ్యక్షులు గొల్లపల్లి రామ్ రెడ్డి ,సింధు రెడ్డి,ఎల్లేష్ ,రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ , బీజేవైఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి నిరటి చంద్రమోహన్ ,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి ,బీజేవైఎం చేవెళ్ల పార్లమెంట్ కో కన్వీనర్భారత్,బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకులసందీప్,బీజేవైఎంనాయకులు మధు, బీజేవైఎం చందానగర్ డివిజన్ అధ్యక్షులు పిరంగి మల్లేష్ గౌడ్ ,బీజేపీ నాయకులు మనోజ్ ,శ్రవణ్ పాండే ,బీజేవైఎం డివిజన్ ప్రధానకార్యదర్శి సాయి మురళి ,బీజేవైఎం నాయకులు లింగం సురేష్ , కిరణ్ , వినోద్ చౌదరి ,మణి ,సాయి శివ ,కౌశిక్ ,సాయి,పవన్, ప్రశాంత్ నాని తదితరులు పాల్గొన్నారు.