
10.3kViews
92
Shares
లబ్ధిదారులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలి. బీజేపీ నాయకులు…
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి 8 సంవత్సరాలైనా ఇవ్వకుండా ప్రజలను ఎన్నికలోచ్చినప్పుడల్ల ఇస్తామని మోసం చేస్తూ ఇంతవరకు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా కాలం గడుపుతున్న ప్రభుత్వానికి నిరసనగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని హఫీజ్ పేట్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన బీజేపీ నాయకులు. అనంతరం మసీద్ బండ నుండి భారీ ర్యాలీగా వెళ్లి శేరిలింగంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మండల తహశీల్దార్ కి డిప్యూటీ కమిషనర్ కి బీజేపీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు.