
1.1kViews
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : డివిజన్ లోని ప్రభుపాద లే ఔట్ లో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు డ్రైనేజీ సమస్యలను తెలుసుకొని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పాత పైపులైనులను క్రమబద్ధికరించి , వాటి స్థానంలో త్వరితగతిన, కొత్తగా పైపు లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.