
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్న డ్రగ్ పెడ్లర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడి వద్ద 12 గ్రాముల యమ్డియమ్ఏ డ్రగ్స్, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలించి అమ్ముతున్న సూడాన్ దేశానికి చెందిన డ్రగ్ పెడ్లర్ను,హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సూడాన్ దేశానికి చెందిన మహ్మద్ యాకుబ్ భారత దేశానికి చదుకోవడానికి వచ్చాడు. కానీ చదువు ముసుగులో అక్రమంగా బెంగళూరు నుంచి డ్రగ్స్ తరలించి హైదరాబాద్లో అమ్ముతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు పాతబస్తీ, ఫలక్నుమా పోలీసులు, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులతో కలిసి చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో నిందితుడు పట్టుపడ్డాడు. యాకుబ్ గతంలో హైదరాబాద్లోనే ఉండేవాడని అతనిపై రాజేంద్రనగర్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతడి వద్ద 12 గ్రాముల యమ్డియమ్ఏ డ్రగ్స్,ఒక మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.