
10.3kViews
62
Shares
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో దశాబ్ది ఉత్సవాల నిర్వాహిస్తున్న సందర్బంగా… సర్కారు చేపట్టబోయే కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబీనేట్లో తీసుకున్న నిర్ణయాల మేరకు.. సొంత జాగా ఉన్న వారికి మూడు లక్షల ఆర్థిక సాయం. గృహాలక్ష్మి పథకం విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి వందశాతం రాయితీతో 3 దఫాలుగా లక్ష చొప్పున నేరుగా ఖాతాల్లోనే జమ చేయనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి 3 వేల చొప్పున లబ్ధిదారుల ఎంపిక. తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి.