
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అధికారుల నిర్లక్ష్యం వల్ల కలుషిత నీరు త్రాగి రెండు ప్రాణాలు పోయాయని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని లోని వడ్డెర బస్తి ,గుట్టల బేగంపెట్ లో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే వారితో పాటు 130 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. దానికి నిరాసనగా బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అద్వర్యంలో హఫీజ్ పెట్ జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు.కలుషిత నీరు తాగి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు.మూడు నెలలుగా కాలనీలో కలుషిత నీరు సరఫరా అవుతుందని అధికారులకు స్థానికులు చెప్పినా స్పందించకపోవడం దారుణమన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కలుషిత నీటిని తాగి బస్తీ వాసులు అస్వస్థతకు గురయ్యారని, ఇద్దరు మృతి చెందారని అన్నారు. ఇందుకు కారకులైన సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే బస్తీలోని డ్రైనేజీ, మంచి నీటి పైపు లైన్లను సరిచేయాలన్నారు. నియోజకవర్గంలోని బస్తీల్లో ఇలాంటి సమస్యలు రాకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా డ్రైనేజీ, నీటి సమస్యలను మెరుగుపరచాలి అని సూచించారు.ఈ డిమాండ్లను 48 గంటల్లో తీర్చకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు యోగానంద్, మొవ్వ సత్యనారాయణ,రవి కుమార్ యాదవ్,నరేష్, నాయకులు గంగాధర్ రెడ్డి,బుచ్చిరెడ్డి, డిఎస్ఆర్కె ప్రసాద్,ప్రభాకర్ యాదవ్,మారం వెంకట్,హరికృష్ణ,రాధాకృష్ణ యాదవ్, విజయలక్ష్మి,నాగేశ్వర్ గౌడ్, శ్రీశైలం కురుమ,రఘునాథ్ యాదవ్,హనుమాన్ నాయక్,జితేందర్,కాంచన కృష్ణ, కసిరెడ్డి సిందురెడ్డి, విజేందర్,వీర చారి,డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు,మాణిక్ రావు,రాజు శెట్టి, ఆంజనేయులు,నవీన్ గౌడ్,కమలాకర్,నర్సింగ్, భూపాల్ రెడ్డి,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.