Home » గత పాలకుల తప్పిదాలవల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు : కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

గత పాలకుల తప్పిదాలవల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు : కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

by Admin
1.2kViews
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ లోని నల్లగండ్ల హుడా కాలనీ,మంజీర డైమండ్ లో నెలకొన్సమస్యలపై  పోరాటం చేస్తున్న కార్పొరేటర్ కార్పొరేటర్ గంగాదర్ రెడ్డి వాటి పరిష్కారానికి అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో సోమవారం నల్లగండ్ల లోని నల్లగండ్ల హుడా కాలనీ,మంజీర డైమండ్ లో నెలకొన్న మురికి నీటి సమస్య పై వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డ్ అధికారులతో కల్సి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పర్యటించి అధికారులకు తగు సూచనలు చేశారు. గతపాలకు చేసిన తప్పిదాల వల్ల ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చిత్తశుద్ధి లేని పాలకులు, అధికారులు ఇప్పటికైనా మురికి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.అందుకు స్పందించిన అధికారులు మురికి నీరు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎస్టీపి ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన స్థలం గురించి ఇటు శేరిలింగంపల్లి, అటు పటాన్ చెరు ఎమ్మెల్యే లతోను, ఉన్నతాధికారులతోను చర్చించి పరిష్కారం చూపుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ జి.ఎం. రాజశేఖర్,డీజీఎం నారాయణ,ఎస్ టి పీ ప్లాంట్ మనేజర్ పద్మజ,రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, తెల్లాపూర్ కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి,నారాయణ,నల్లగండ్ల హుడా కాలనీ,డిఫెన్సె కాలనీ వాసులు సత్యనారాయణ యాదవ్,రఘుపతి రెడ్డి,పొంచిరెడ్డి,సతీష్,చంద్రశేఖర్,మురుతోంజయ్,కృష్ణ,సుబ్బా రావు, రమేష్,కిరణ్,సాస్ట్రీ,దశరథ్, పావని, సులోచన, పద్మ,అరుణ,డాక్టర్ సీత,గోపాల్ రెడ్డి,పాపి రెడ్డి,మనోజ్,తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment