
430Views
తెలంగాణ మిర్రర్,పటాన్చెరు : పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వెదిరి కాలనీలో నూతనంగా నిర్మించిన గణపతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపనలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.