
440Views
స్వామి వారిని దర్శించుకున్న కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్
తెలంగాణ మిర్రర్,పటాన్చెరు : జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో ఆదినారాయణ స్వామి వారి జాతర మహోత్సవం వైభవంగానిర్వహించారు.ఈ ఉత్సవంలో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం మెదక్ పార్లమెంట్ ఇంఛార్జి గాలి అనిల్ కుమార్,మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్,మండల్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ నాగేందర్ గౌడ్,గోవర్ధన్ గౌడ్, ప్రతాప్, వడ్డె క్రిష్ణ, నర్సింగ్ రావు, హరిశంకర్, నాగరాజు, మల్లేష్, వీరేందర్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.