
11.4kViews
123
Shares
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు సుపరిపాలన అందుతుందని కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కూతురు హారిక గౌడ్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు,కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన తండ్రి వి.జగదీశ్వర్ గౌడ్ గెలిపిస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ మేనిఫెస్టోను పంపిణి చేస్తూ ఓటర్లకు వివరించారు. అన్నారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.