
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పలువురు సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – చెక్కులను మాజీ కార్పొరేటర్ రంగరావు తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల వివరాలు :
1.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గణేష్ నగర్ కి చెందిన సునీత కి – 60,000 /-
2.హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ కి చెందిన సద్దాం ఖురేషి కి – 60,000 /-
3.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కి చెందిన తులసి భవాని కి – 26,000 /-
రూపాయలుగా మంజూరి అయినవి అని, అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు దామోదర్ రెడ్డి, బ్రిక్ శ్రీను, కాశినాథ్ యాదవ్, శ్రీనివాస్ చౌదరీ, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.