
710Views
తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గోపన్ పల్లి లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న యుజిడి పైప్లైన్ నిర్మాణ పనులను పరిశీలించరు. అనంతరం ఆయన గోపన్ పల్లి వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోపన్ పల్లి లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు ఉండడంతో పాత డ్రైనేజీ పైప్ లైన్ బ్లాక్ అయినందువలన, కొత్త పైప్ లైన్ వేస్తున్న పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ప్రకాష్ రంగస్వామి, కాలనీ వాసులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.