Home » అన్ని మతాల వారి పండగలకు ప్రధాన్యత : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

అన్ని మతాల వారి పండగలకు ప్రధాన్యత : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

by Admin
410Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అన్ని మతాల వారి పండగలకు ప్రధాన్యతనిస్తూ సోదరభావంతో ఐక్యమత్యానికి ప్రతీకగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.డివిజన్ పరిధిలోని పి ఏ నగర్,హెచ్ ఎం టి కాలనీలో పాస్టర్ రత్నంతో కలిసి అర్హులైన పేద క్రిస్టియన్లకు గురువారం క్రిస్మస్ బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించి ప్రతి పేదవాడు తమ పండుగలను ఘనంగా జరుపుకునే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు రామచంద్ర, జీతయ్య, చంద్రయ్య, బిక్షపతి కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment