
తెలంగాణ మిర్రర్, మియాపూర్: శేరిలింగంపల్లి పరిధిలోని మియాపూర్ బస్ డిపో వద్ద అక్టోబర్ 5న ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల త్యాగాల దినంగా పాటిద్దాం అని టి.ఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మియాపూర్ వన్ డిపోలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల త్యాగాల దినం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని 38 మంది కార్మికుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2019 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె లో 55 రోజుల పోరాటం లో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందని వారి త్యాగాలను కూడా గుర్తించని ప్రభుత్వం ఇప్పటివరకు ఆనాటి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. 2017 ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన వేతన సవరణ ఇంత వరకూ జరగలేదు అదేవిధంగా 2021లో ఏప్రిల్ 1న జరగవలసిన అవసరం ఉన్నది అంటే రెండు వేతన సవరణలు జరగవలసి ఉన్నప్పటికీ ఇంతవరకూ ప్రభుత్వం ఆ విషయాల గురించి పట్టించుకోవడం లేదు అని అన్నారు. చివరకు కార్మికులకు ఒకటో తేదీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వం ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను అని రకాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ నాయకులు మురళి, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఈమని వినాయక రెడ్డి, రాజబాబు, భాస్కర్, అశోక్, కార్మికులు పాల్గొన్నారు.